రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యల్లో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు రూరల్ మరియు అర్బన్ జిల్లాలలో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. జూలై 14, మంగళవారం రాత్రి 8 గంటల నుంచి నుంచి వారం రోజుల పాటు జూలై 22 ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ విధించనున్నట్టు వెల్లడించారు.
అత్యవసర సేవలతో పాటుగా కిరాణా, మరికొన్ని రకాల దుకాణాలకు అనుమతి ఇచ్చారు. పాలు, కిరాణా, కూరగాయలతో సహా అవసరమైన వస్తువులను విక్రయించే దుకాణాలు ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవవచ్చుని తెలిపారు. పుడ్ సహా ఇతర వస్తువుల హోమ్ డెలివరీకి అవకాశం ఇచ్చారు. లాక్డౌన్ సమయంలో బస్సులు, ఇతర ప్రజారవాణాపై నిషేధం విధించారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41581 కి చేరుకుంది. వీరిలో 16249 మంది కరోనా నుంచి కోలుకోగా, 759 మంది మరణించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu