పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అయితే లోక్సభ సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళననకు దిగటంతో మధ్యాహ్నం 2 గంటలకు వరకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఇటీవల ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఘర్షణల్లో 45 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అల్లర్ల అంశంపై చర్చ జరపాలని కాంగ్రెస్ లోక్సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌధురీ సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.
డీఎంకే, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, ఏఐఎంఐఎం తదితర పార్టీలు కూడా ఈ అంశంపై వేర్వేరుగా నోటీసులివ్వడంతో, ఢిల్లీ హింసాత్మక ఘటనపై లోక్సభకు మొత్తంగా 23 నోటీసులు అందాయి. అలాగే ఢిల్లీ ఘర్షణలకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్పీకర్ ఎంత విజ్ఞప్తి చేసినా విపక్షాల సభ్యులు వినిపించుకోకుండా చర్చకు పట్టుబట్టడంతో సభను మధ్యాహ్ననికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
[subscribe]