ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలహాదారుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ నియమించబడ్డారు. ఈ మేరకు సుభాష్ చంద్ర గార్గ్కు కేబినెట్ హోదా కల్పిస్తూ, ఆ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగేలా మార్చ్ 1, ఆదివారం నాడు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1983 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ అధికారి అయినా సుభాష్ చంద్రకు గతంలో కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, ఆర్బీఐ సెంట్రల్ బోర్డు, సెబీలో సభ్యుడిగా కూడా సుభాష్ చంద్ర తన సేవలు అందించారు. ఆర్థిక వనరుల సమీకరణలో సీఎం వైఎస్ జగన్ కు సుభాష్ చంద్ర సలహాదారుగా వ్యవహరించనున్నారు. మరో వైపు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఉన్న కార్తికేయ మిశ్రాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి(ఆర్థిక వనరుల సమీకరణ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
[subscribe]