శ్రీరామ నవమి వేళ మధ్యప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. గురువారం పండుగ సందర్భంగా ఇండోర్లోని ఒక ఆలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులు భారీగా హాజరయ్యారు. ఈ క్రమంలో భక్తులు ఎక్కువమంది రావడంతో స్థలం సరిపోక కొంతమంది ఆలయం ప్రాంగణంలో ఉన్న ఒక పురాతన ‘బావడి’ (పెద్ద బావి) పైకి ఎక్కారు. అయితే అకస్మాత్తుగా పైకప్పు కూలిపోవడంతో దానిపైనున్నవారు ఒక్కసారిగా కింద బావిలోకి పడిపోయారు. ఈ ఘటనలో 11 మంది భక్తులు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ అధికారులు, పోలీసులు మరియు విపత్తు నిర్వహణ బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. మొత్తం 18 మందిని రక్షించిన అధికారులు లోపల మరో ఏడుగురు ఇంకా చిక్కుకుని ఉన్నట్లు గుర్తించి సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఇలా తెలిపారు.. ఇండోర్లో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ తో మాట్లాడాను. అక్కడి పరిస్థితిపై ఆయన వివరాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన రెస్క్యూ మరియు రిలీఫ్ పనులకు నాయకత్వం వహిస్తోంది. బాధితులకు మరియు వారి కుటుంబాలకు నా ప్రార్థనలు’ అని పేర్కొన్నారు. మరోవైపు సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ దీనిపై స్పందిస్తూ.. ఘటనపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని, అయితే దురదృష్టవశాత్తు కొంతమంది మరణించారని తెలిపారు. మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, అలాగే వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Extremely pained by the mishap in Indore. Spoke to CM @ChouhanShivraj Ji and took an update on the situation. The State Government is spearheading rescue and relief work at a quick pace. My prayers with all those affected and their families.
— Narendra Modi (@narendramodi) March 30, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE