వెస్టిండీస్పై వన్డేలు, టీ20 లలో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా ఫుల్ జోష్ లో దూసుకెళ్తోంది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో కూడా విజయంతో మొదలుపెట్టింది. నిన్న జరిగిన తొలి టి20లో టీమిండియా 62 పరుగులతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగి ఆడాడు. అతనికి తోడు శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు), రోహిత్ శర్మ (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 1 సిక్స్) లంక బౌలర్లను ఊచకోత కోశారు.
ఆ తర్వాత లక్ష్యాన్ని 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులకే పరిమితమైంది. లంక జట్టులో చరిత్ అసలంక (47 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు) సత్తా చాటాడు. తర్వాత కరుణరత్నే (21), చమీర (24 నాటౌట్) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు కానీ, లక్ష్యం భారీగా ఉండటంతో పాటు భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పోవడంతో లంక ఓటమి చెందక తప్పలేదు. భువనేశ్వర్, వెంకటేశ్ అయ్యర్ చేరి రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, చాహల్ ఒక్కో వికెట్ తీశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా ఇషాన్ కిషన్ నిలిచాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) కుమార 44; ఇషాన్ (సి) లియనాగె (బి) షనక 89; శ్రేయస్ నాటౌట్ 57; జడేజా నాటౌట్ 3; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 199.
బౌలింగ్: చమీర 4–0–42–0, కుమార 4–0–43–1, కరుణరత్నే 4–0–46–0, జయవిక్రమ 2–0–15–0, జెఫ్రీ వండెర్సే 4–0–34–0, షనక 2–0–19–1.
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (బి) భువనేశ్వర్ 0; మిశార (సి) రోహిత్ (బి) భువనేశ్వర్ 13; లియనాగె (సి) సామ్సన్ (బి) వెంకటేశ్ 11; అసలంక నాటౌట్ 53; చండిమల్ (స్టంప్డ్) ఇషాన్ (బి) జడేజా 10, షనక (సి) భువనేశ్వర్ (బి) చహల్ 3; కరుణరత్నే (సి) ఇషాన్ (బి) వెంకటేశ్ 21; చమీర నాటౌట్ 24; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137.
బౌలింగ్: భువనేశ్వర్ 2–0–9–2, బుమ్రా 3–0–19–0, హర్షల్ 2–0–10–0, చహల్ 3–0–11–1, వెంకటేశ్ అయ్యర్ 3–0–36–2, జడేజా 4–0–28–1, దీపక్ హుడా 3–0–24–0.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ