ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

Maharashtra CM Eknath Shinde Deputy CM Devendra Fadnavis Meet PM Narendra Modi in New Delhi, Deputy CM Devendra Fadnavis Meet PM Narendra Modi in New Delhi, Maharashtra CM Eknath Shinde Meet PM Narendra Modi in New Delhi, PM Narendra Modi in New Delhi, Maharashtra CM Eknath Shinde, Deputy CM Devendra Fadnavis, Devendra Fadnavis, Eknath Shinde, Maharashtra, CM Eknath Shinde, Maharashtra CM, New Delhi, CM Eknath Shinde Delhi Tour, CM Eknath Shinde Delhi Tour News, CM Eknath Shinde Delhi Tour Latest News, CM Eknath Shinde Delhi Tour Latest Updates, CM Eknath Shinde Delhi Tour Live Updates, Mango News, Mango News Telugu,

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ న్యూఢిల్లీలో 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికార నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు ప్రధాని మోదీతో సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు ప్రధానితో చర్చించినట్టు తెలుస్తుంది.

మరోవైపు శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయి రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించారు. ఇక శనివారం ఉదయం నుంచి వరుసగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా వారు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం అనంతరం కేబినెట్ ఏర్పాటుకు ముందు సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ పెద్దలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 9 =