శ్రీలంకలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీలంక ప్రధాని పదవీకి రణిల్ విక్రమసింఘే రాజీనామా చేశారు. ఈ మేరకు రణిల్ విక్రమసింఘే ట్వీట్ చేస్తూ, “పౌరులందరి భద్రతతో సహా ప్రభుత్వ కొనసాగింపును నిర్ధారించడానికి నేను ఈ రోజు పార్టీ నాయకుల ఉత్తమ సిఫార్సును అంగీకరించాను. అఖిల పక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నేను అంగీకరిస్తున్నాను. దీన్ని సులభతరం చేయడానికి నేను ప్రధాని పదవికి రాజీనామా చేస్తాను” అని పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొన్న శ్రీలంకలో శనివారం మరోసారి అనూహ్య పరిణామాలు ఏర్పడ్డాయి. వేలాది మంది ఒక్కసారిగా శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధ్యక్షా భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు గొటబాయ రాజపక్స అక్కడి నుంచి పారిపోయారని ఆ దేశ రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాలకులపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొనడం, నిరసనకారులు ఆందోళనను తీవ్రతరం చేయడం దృష్ట్యా ఏర్పడ్డ పరిస్థితుల కారణంగానే ప్రధాని పదవీకి రణిల్ విక్రమసింఘే కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY