దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి రోజురోజుకి ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 415 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించింది. మొత్తం 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైయినట్టు తెలిపారు. అత్యధికంగా మహారాష్ట్రలో 108 ఒమిక్రాన్ కేసులు నమోదవగా, ఢిల్లీలో 79, గుజరాత్ లో 43, తెలంగాణలో 38, కేరళలో 37, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, రాజస్థాన్ లో 22, హర్యానాలో 4, ఒడిశాలో 4, ఆంధ్రప్రదేశ్ లో 4, జమ్మూ కాశ్మీర్ లో 3, వెస్ట్ బెంగాల్ లో 3, ఉత్తర్ ప్రదేశ్ లో 2, చండీఘర్ లో 1, లద్దాఖ్ లో 1, ఉత్తరాఖండ్ లో 1 నమోదయ్యాయి. కాగా మొత్తం 415 బాధితుల్లో ఇప్పటికే 115 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ