మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల ఆ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15, మంగళవారం నాడు కొత్తగా 20,482 కరోనా పాజిటివ్ కేసులు, 515 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10,97,856 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 30,409 కు పెరిగింది. మరోవైపు మహారాష్ట్రలో మంగళవారం నాటికీ 54,09,060 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (సెప్టెంబర్ 15, మంగళవారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షలు – 54,09,060
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 10,97,856
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 7,75,273
- యాక్టీవ్ కేసులు – 2,91,797
- సెప్టెంబర్ 15 న నమోదైన కేసులు – 20,482
- సెప్టెంబర్ 15 న డిశ్చార్జ్ అయినవారు – 19,423
- సెప్టెంబర్ 15 న నమోదైన మరణాల సంఖ్య – 515
- మొత్తం మరణాల సంఖ్య – 30,409
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu