ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకోగా ఫలితం పాజిటివ్ గా వచ్చిందని చెప్పారు. అవసరమైన చికిత్స తీసుకుంటున్నానని, ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటున్నట్టు తెలిపారు. గత ఒక వారం రోజులుగా తనను కలిసిన వారంతా దయచేసి కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరించాలని సూచించారు. అలాగే కరోనా పరీక్షలు చేయించుకుని, అన్ని జాగ్రత్త తీసుకోవాలని కోరారు. మరోవైపు ఏప్రిల్ 23, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,09,228 కు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ