మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు పదివేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 1, ఆదివారం నాడు 6,479 కరోనా కేసులు, 157 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 63,10,194 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,32,948 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 4,110 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 60,94,896 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.59 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.1 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 78,962 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఆదివారం నాటికి మహారాష్ట్రలో 4,81,85,350 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ