ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,68,462 కు చేరుకుంది. గత 24 గంటల్లో 85,856 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 2287 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 410, కర్నూల్ జిల్లాలో 48, కృష్ణా జిల్లాలో 299, కడప జిల్లాలో 125, గుంటూరు జిల్లాలో 231, చిత్తూరు జిల్లాలో 377, అనంతపూర్ జిల్లాలో 59, నెల్లూరు జిల్లాలో 187, శ్రీకాకుళంలో 45, విశాఖపట్నంలో 170, పశ్చిమగోదావరిలో 123, ప్రకాశం జిల్లాలో 185, విజయనగరంలో 28 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో మరో 18 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 13395 కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 2,430 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 19,34,048 కు చేరింది. అలాగే ప్రస్తుతం 21,019 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక ఆగస్టు 1 నాటికీ ఏపీలో మొత్తం 2,46,48,899 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ