మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 18, బుధవారం నాడు కూడా కొత్తగా 5011 పాజిటివ్ కేసులు, 100 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,57,520 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 46,202 కు పెరిగింది. మరోవైపు ఇప్పటికే 16,30,111 మంది సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అవ్వగా, ప్రస్తుతం 80,221 మంది చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (నవంబర్ 18, బుధవారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 99,00,878
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 17,57,520
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 16,30,111
- యాక్టీవ్ కేసులు – 80,221
- నవంబర్ 18 న నమోదైన కేసులు – 5011
- నవంబర్ 18 న డిశ్చార్జ్ అయినవారు – 6608
- నవంబర్ 18 న నమోదైన మరణాల సంఖ్య – 100
- మొత్తం మరణాల సంఖ్య – 46,202
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ