మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచలనాను నిజం చేస్తూ భారతీయ జనతా పార్టీ తన జోరును కొనసాగిస్తుంది. రెండు రాష్ట్రాలలోను బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 150 పైగా స్థానాల్లో బీజేపీ-శివసేన కూటమి ఆధిక్యంలో ఉండగా, 95 పైగా స్థానాల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి, ఇతరులు 40 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అదేవిధంగా హర్యానాలో బీజేపీ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 32, జేజేపీ 11, ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలను అక్టోబర్ 21 న నిర్వహించారు. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హర్యానాలోని 90 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ రోజు సాయంత్రం కల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. నాగ్ పూర్ సౌత్ నుంచి సీఎం దేవేంద్ర ఫడణవీస్, వర్లి నియోజక వర్గం నుంచి నుంచి ఆదిత్య థాకరే, కర్నాల్లో హర్యానా ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్టర్ ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల పలితాలతో పాటు ఇతర 18 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి.
[subscribe]