ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1395 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 17, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,56,159 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 6890 కి పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల కంటే కోలుకున్నవారే అధికంగా ఉన్నారు. గత 24 గంటల్లో 2293 మంది కరోనా నుంచి రికవరీ అయినట్టు తెలిపారు.
అలాగే గడిచిన 24 గంటల్లో 66,778 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు. ఇక కరోనా వలన చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, అనంతపూర్ లో ఒకరు, కడపలో ఒకరు మరియు తూర్పుగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6890 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 17, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 92,64,085
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,56,159
- కొత్తగా నమోదైనా కేసులు : 1395
- నమోదైన మరణాలు : 9
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,32,284
- యాక్టీవ్ కేసులు : 16985
- మొత్తం మరణాల సంఖ్య : 6890
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ