దేశంలో కరోనా వ్యాప్తి మొదలయినప్పటి నుంచి మహారాష్ట్ర రాష్ట్రంలో అధిక ప్రభావం చూపుతుంది. మహారాష్ట్రలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 5, గురువారం నాడు ఒక్కరోజే కొత్తగా 10309 కరోనా పాజిటివ్ కేసులు, 334 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,68,265 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 16,476 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 6165 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 3,05,521 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,45,961 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఆగస్టు 5 నాటికీ 24,18,299 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu