దేశంలో రేపు తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం వంటి నాలుగు రాష్ట్రాలు, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపటి పోలింగ్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాల్లో, కేరళలో 140 అసెంబ్లీ స్థానాల్లో, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు రేపు ఒకేదశలో పోలింగ్ జరగనుంది. ఇక పశ్చిమబెంగాల్, అస్సాంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తవగా రేపు మూడో దశ పోలింగ్ జరగనుంది. రేపటితో అస్సాంలో కూడా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తవనుంది. పశ్చిమబెంగాల్ లో మాత్రం రేపు గాకా మరో 5 దశల పోలింగ్ మిగిలివుంది.
తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, డీఎంకే-కాంగ్రెస్ కూటమి, కమల్ హాసన్ నేతృత్వంలోని థర్డ్ ఫ్రంట్ కీలక ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికల్లో ఎవరూ పైచేయి సాధిస్తారో వేచిచూడాల్సి ఉంది. కేరళలో సీపీఎం నేతృత్వంలో ఎల్డిఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్, బీజేపీ పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఇక పుదుచ్చేరిలో కాంగ్రెస్-డీఎంకే కూటమి, ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా పోరాడాయి. ఇటీవల పుదుచ్చేరిలో పరిణామాల దృష్ట్యా ప్రజలు ఏ కూటమికి మద్దతిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు ఒకేరోజులో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఉండడంతో, పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని చోట్ల భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ