దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గానూ సీబీఎస్ఈకి సంబంధించి 9 నుంచి 12 వ తరగతుల వరకు 30 శాతం సిలబస్ ను తగ్గిస్తున్నట్టు కేంద్రహెఛ్ఆర్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఈ రోజు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
“దేశంలో మరియు ప్రపంచంలో కరోనా వలన ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా పాఠ్యాంశాలను సవరించాలని, అలాగే 9 వ తరగతి నుండి 12 వ తరగతి విద్యార్థులకు సిలబస్ ను తగ్గించాలని సీబీఎస్ఈ సూచించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు కొన్ని వారాల క్రితం సిలబస్ తగ్గింపుపై విద్యావేత్తల నుండి సలహాలను ఆహ్వానించాము. 1500 మందికి పైగా ఈ అంశంపై స్పందించి సూచనలు చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అభ్యాస సాధన యొక్క ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, పాఠ్యాంశాలలో ప్రధాన అంశాలను అలాగే ఉంచడం ద్వారా సిలబస్ను 30% వరకు తగ్గించాలని నిర్ణయించామని” మంత్రి రమేశ్ పోఖ్రియాల్ పేర్కొన్నారు.
Looking at the extraordinary situation prevailing in the country and the world, #CBSE was advised to revise the curriculum and reduce course load for the students of Class 9th to 12th. @PMOIndia @HMOIndia @PIB_India @MIB_India @DDNewslive @cbseindia29 @mygovindia
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 7, 2020
📢Considering the importance of learning achievement, it has been decided to rationalize syllabus up to 30% by retaining the core concepts.@PMOIndia @HMOIndia @HRDMinistry @mygovindia @transformIndia @cbseindia29 @mygovindia
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 7, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu