మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 4, బుధవారం నాడు కూడా 5505 కరోనా కేసులు, 125 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,98,198 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 44,548 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 8,728 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 15,40,005 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 90.68 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.62 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,12,912 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు బుధవారం నాటికీ మహారాష్ట్రలో 91,85,838 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ