మహారాష్ట్ర రాష్ట్రంలో ఇటీవల కరోనా ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టినా, మళ్ళీ గత రెండ్రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 19, గురువారం నాడు కూడా 5535 కరోనా కేసులు, 154 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,63,055 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 46,356 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 5,860 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 16,35,971 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.79 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.63 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 79,738 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు గురువారం నాటికీ మహారాష్ట్రలో 99,65,119 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ