మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 41 శాతానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15, గురువారం కూడా 61,695 కరోనా కేసులు, 349 మరణాలు నమోదయ్యాయి.
దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 36,39,855 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 59,153 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 53,335 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 29,59,056 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 81.3 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.63 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 6,20,060 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు గురువారం నాటికి మహారాష్ట్రలో 2,30,36,652 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ