తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్-2021 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) దరఖాస్తు గడువును పొడిగించారు. గతంలో ఈ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఏప్రిల్ 15 గా నిర్ణయించగా, ఆ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తునట్టు టీజీసెట్ చీఫ్ కన్వీనర్ ప్రకటించారు.
“తల్లిదండ్రులు మరియు విద్యార్థుల నుండి వచ్చిన అనేక అభ్యర్ధనలను అనుసరించి 2021-2022 విద్యా సంవత్సరానికి గాను సోషల్, ట్రైబల్, బీసీ మరియు జనరల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో 5వ తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీని ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30 వరకు పొడిగించాం. ప్రవేశానికి సంబంధించిన ప్రశ్నల కోసం అభ్యర్థులు టోల్ఫ్రీ నంబర్ 1800 425 45678 ను సంప్రదించవచ్చు. అభ్యర్థులు ప్రాస్పెక్టస్, అర్హత ప్రమాణాలు మరియు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ కోసం www.tswreis.in, http:/tgcet.cgg.gov.in, http:/mjptbcwreis.telangana.gov.in, http:/tgtwgurukulam.telangana.gov.in, http:/tresidential.gov.in వంటి వెబ్సైట్లను సందర్శించాలని సూచిస్తున్నాం” అని టీజీసెట్ చీఫ్ కన్వీనర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ