మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24, శనివారం కూడా 67160 కరోనా కేసులు, 676 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,28,836 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 62,928 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 63,818 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 34,68,610 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 82.02 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.51 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 6,94,480 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి మహారాష్ట్రలో 2,54,60,008 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ