తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలుకానుంది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్స్, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటుగా సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే బీజేపీ కార్పొరేటర్ మృతితో ఖాళీ అయిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) 18 వ వార్డు సహా పలు మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన వార్డులకు కూడా ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ మే 3వ తేదీన చేపట్టనున్నారు. ఎన్నికలు జరిగే కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీల రిజర్వేషన్ల జాబితాను గురువారం ఉదయం అధికారులు విడుదల చేశారు.
రెండు కార్పొరేషన్స్, ఐదు మున్సిపాలిటీల ఎన్నికల షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ తేదీ: ఏప్రిల్ 16
- నామినేషన్లు ప్రారంభం: ఏప్రిల్ 16
- నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ: ఏప్రిల్ 18
- నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 19
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 22
- పోలింగ్ తేదీ: ఏప్రిల్ 30 (ఉదయం 7 గంటలు నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
- రీ-పోలింగ్ (అవసరమైతే): మే 2
- లెక్కింపు పక్రియ: మే 3
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ