మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతుండడంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 14, మంగళవారం నాడు కొత్తగా 6741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,665 కి చేరింది. గత 24 గంటల్లో 213 కరోనా మరణాలు నమోదుకాగా, ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 10,695 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 4500 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,49,007 కి చేరింది. ప్రస్తుతం 1,07,665 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో మంగళవారం నాటికీ 13,76,203 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు:
- ముంబయి – 95100
- థానే – 65324
- పుణే – 42092
- పాల్గర్ – 10226
- రాయఘడ్ – 9110
- ఔరంగాబాద్ – 8659
- నాసిక్ – 7663
- జల్గావ్ – 6355
- సోలాపూర్ – 4478
- నాగపూర్ – 2156
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu