ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా ప్రభావం పెరుగుతుంది. జూలై 14, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 33019 కు చేరింది. మొత్తం కేసుల్లో 30163 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2856 మంది ఉన్నారు. అలాగే కరోనా మరణాల సంఖ్య 408 కి చేరింది. ఇక రాష్ట్రంలో 17467 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 12739 మంది ఆసుపత్రుల్లో, 2405 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 15144 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- అనంతపూర్ – 3651
- చిత్తూరు – 3074
- కర్నూల్ – 3823
- కడప – 1982
- తూర్పుగోదావరి – 3115
- పశ్చిమ గోదావరి – 2026
- నెల్లూరు – 1419
- ప్రకాశం – 1238
- గుంటూరు – 3356
- కృష్ణా – 2744
- శ్రీకాకుళం – 1414
- విజయనగరం – 832
- విశాఖపట్నం – 1489
- ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 2424
- విదేశాల నుంచి వచ్చిన వారు: 432
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu