దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో జూలై 9, గురువారం నాడు కొత్తగా 6875 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,30,599 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క ముంబయి నగరంలోనే ఇప్పటికి 89124 కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 219 కరోనా మరణాలు నమోదుకాగా, ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9667 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 4067 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,27,259 కి చేరింది. ప్రస్తుతం 93654 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో గురువారం నాటికీ 12,25,831 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu