మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య ఇప్పటికే 16 లక్షలు దాటింది. అక్టోబర్ 23, శుక్రవారం నాడు కూడా 7347 కరోనా కేసులు, 184 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,32,544 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 43,015 కి పెరిగింది. ఇక మరో 13,247 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 14,45,103 కు చేరుకుంది. రాష్ట్రంలో రికవరీ రేటు 88.52 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.63 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,43,922 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు శనివారం నాటికీ మహారాష్ట్రలో 84,79,155 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu