మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల ప్రతిరోజూ 8 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 26, శుక్రవారం నాడు కూడా 8333 కరోనా కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,38,154 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 52,041 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 4936 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2017303 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.35 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.43 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 67,608 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి మహారాష్ట్రలో 1,61,12,519 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ