మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉపఎన్నికకు సంబంధించి పార్టీ ఇంచార్జ్ లను, సమన్వయ కర్తలను, మండలాల వారీగా బాధ్యులను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మాజీ డిప్యూటీ సీఎం, సీనియర్ నేత దామోదర రాజనర్సింహను నియమించారు. అలాగే నియోజక ఎన్నికల సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లను
నియమించారు.
- కంట్రోల్ రూమ్ సమన్వయకర్త: కవ్వంపల్లి సత్యనారాయణ
- వీణవంక మండలం ఇన్ఛార్జులు : ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్
- జమ్మికుంట మండలం ఇన్ఛార్జులు : విజయ రమణారావ్, రాజ్ ఠాగూర్
- హుజురాబాద్ మండలం ఇన్ఛార్జులు : టి.నర్సారెడ్డి, లక్ష్మణ్ కుమార్
- హుజురాబాద్ టౌన్ ఇన్ఛార్జులు : బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు
- ఇల్లంతకుంట మండలం ఇన్ఛార్జులు : నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
- కమలపూర్ మండలం ఇన్ఛార్జులు : కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ