మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నవంబర్ లో పాకిస్తాన్ వెళ్లనున్నారు. సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని పాకిస్తాన్ లోని కర్తార్పూర్ లో ఉన్న దర్బార్ సాహిబ్ కు వెళ్లనున్నారు. నవంబర్ 9వ తేదీన కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆహ్వానం మేరకు కర్తార్పూర్ వెళ్లేందుకు గురువారం నాడు మన్మోహన్ సింగ్ అంగీకరిచినట్టుగా తెలుస్తుంది. నవంబర్ 12న గురునానక్ జయంతి కావడంతో కర్తార్పూర్ గురుద్వారాకు వెళ్లే తొలివిడత భక్తులతో కలిసి వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
మన్మోహన్ సింగ్ తో పాటు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడ వెళ్లనున్నారు. కొన్ని రోజుల క్రితం కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలంటూ పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఖురేషి, మన్మోహన్ సింగ్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వేడుకలో పాల్గొనేందుకు మన్మోహన్ వెళ్లడం లేదని మొదట్లో కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే అమరీందర్ సింగ్ ఆహ్వానం మేరకు ప్రధాన కార్యక్రమానికి మన్మోహన్ సింగ్ హాజరుకానున్నట్టు తెలుస్తుంది.
[subscribe]