ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రస్తుతం ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోని ఎఫ్ఐఆర్లపై మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అలాగే భవిష్యత్లో నమోదయ్యే కేసుల్లోనూ అరెస్టు చేయకుండా ఉత్తర్వులిచ్చింది. అలాగే ఉత్తరప్రదేశ్లో జుబేర్పై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్కు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్ఏ బోపన్న ధర్మాసనం బదిలీ చేసింది. అలాగే జుబైర్ ట్వీట్లపై దర్యాప్తు చేసేందుకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కోర్టు రద్దు చేసింది.
కాగా జుబేర్ను ట్వీట్స్ చేయకుండా ఆపాలని యుపి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కూడా న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, సూర్యకాంత్, ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా అతడిని నిరంతరం కస్టడీలో ఉంచడం సమర్థనీయం కాదని పేర్కొంటూ ఈరోజు సాయంత్రం 6 గంటల లోగా జుబేర్ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే దీనికి ముందు రూ. 20,000 బెయిల్ బాండ్ డిపాజిట్ చేయాలని సూచించింది. ఇది ఒక న్యాయవాదిని వాదించవద్దని కోరడం లాంటిదని,అలాగే ఒక జర్నలిస్టును రాయవద్దని కోరలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ