దేశంలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్ గా తేలింది. నేను ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్ లో ఉన్నాను మరియు తేలికపాటి లక్షణాలను ఎదుర్కొంటున్నాను. గత 5 రోజులలో నాతో సంప్రదించిన వారందరినీ వారి ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోమని అభ్యర్థిస్తున్నాను. సురక్షితంగా ఉండండి” అని సీఎం కాన్రాడ్ సంగ్మా పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక సీఎం యడియూరప్ప, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కరోనా వైరస్ బారినపడి, చికిత్స అనంతరం కోలుకున్నారు.
I have tested positive for #Covid_19. I am under home isolation and experiencing mild symptoms. I request all those who came in contact with me in the past 5 days to kindly keep a watch on their health and if necessary get tested. Stay safe.
— Conrad Sangma (@SangmaConrad) December 11, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ