కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29, బుధవారం నాడు దేశవ్యాప్త లాక్డౌన్ పరిస్థితులపై కేంద్ర హోమ్ శాఖ సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. లాక్డౌన్ విధించడం వలన కరోనా వ్యాప్తి నివారణలో అద్భుతమైన ఫలితాలు, పరిస్థితిలో మెరుగుదల కనిపించాయని చెప్పారు. ఈ నియంత్రణ చర్యలు ఎలాంటి ప్రభావితం కాకుండా ప్రభుత్వం జారీచేసిన లాక్డౌన్ మార్గదర్శకాలను మే 3 వరకు ఖచ్చితంగా పాటించాలని కేంద్ర హోమ్ శాఖ స్పష్టం చేసింది.
ఇక కోవిడ్-19 (కరోనా వైరస్)తో చేసే పోరాటంలో భాగంగా లాక్డౌన్ యొక్క కొత్త మార్గదర్శకాలు మే 4 వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన లాక్డౌన్ గడువు మే 3 తో ముగుస్తుండడంతో మరుసటి రోజు నుంచి దేశంలో చాలా జిల్లాల్లో గణనీయమైన లాక్డౌన్ సడలింపులు ఉంటాయని కేంద్ర హోమ్ శాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు రాబోయే రోజుల్లో తెలియజేయబడతాయని పేర్కొన్నారు.
New guidelines to fight #COVID19 will come into effect from 4th May, which shall give considerable relaxations to many districts. Details regarding this shall be communicated in the days to come.#coronavirus update#StayHomeStaySafe@PMOIndia @HMOIndia @MoHFW_INDIA
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) April 29, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu