కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వనపర్తిలో జరిగిన ఓ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ఐటీ,మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడితో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తిని కొందరు పోలీసులు కింద పడేసి కొట్టిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి చిత్రీకరించి ట్విటర్ మాధ్యమం ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, ఈ తరహా పోలీసుల వైఖరి ఎట్టి పరిస్థితులలోనూ ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి సంఘటనపై విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు.
ఇలాంటి ప్రతికూల సమయాల్లో నిత్యం ఎంతో కష్టపడి సమర్థంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులందరికీ, కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో చెడ్డ పేరు వస్తోందని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఈ ఘటనపై వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు స్పందిస్తూ, ఈ ఘటనకు సంబంధించి పోలీసుల తీరుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఎస్పీ అపూర్వారావు హామీ ఇచ్చారు.
Dear HM Mahmood Ali Saab & @TelanganaDGP Garu, this attitude of police is unacceptable in ANY circumstances
Request you to take the strictest action on incidents such as this
All the exceptionally good work of thousands of policemen is undone by erratic behaviour of few https://t.co/CaOAU9ercw
— KTR (@KTRTRS) April 2, 2020
Sir, We appoligise to public for such behaviour by an on-duty constable. This incident has been enquired into and strict disciplinary action has been initiated on the person responsible. We will ensure that such incidents do not repeat.
— Apoorva Rao@ SP Wanaparthy (@SpWanaparthy) April 2, 2020
[subscribe]