దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల, కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న కోవిడ్ నియంత్రణ చర్యల అమలును జనవరి 31, 2022 వరకు పొడిగిస్తునట్టు కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు లేఖ రాశారు. విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలు ప్రకారం కోవిడ్ నియంత్రణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
కోవిడ్-19 నిర్వహణకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకునేలా జిల్లా మరియు సంబంధిత స్థానిక అధికారులందరికీ కఠినమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. సోషల్ డిస్టెన్స్ లో భాగంగా అవసరమైతే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు 144 సెక్షన్ విధించవచ్చని తెలిపారు. ఎవరైనా కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
దేశంలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో డిసెంబర్ 21న కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు లేఖ రాసి చేసిన పలు కీలక సూచనలను ఖచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయిన ఓమిక్రాన్, డెల్టా రకం (వేరియంట్ ఆఫ్ కన్సర్న్) కంటే కనీసం 3 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందన్నారు. అందువలన స్థానికంగా మరియు జిల్లా స్థాయిలో దూరదృష్టితో డేటా విశ్లేషణ, డైనమిక్ నిర్ణయాలతో కఠినమైన మరియు సత్వర కంటైన్మెంట్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ ని కట్టడికోసం తక్షణమే వార్ రూమ్లను యాక్టివేట్ చేయాలన్నారు. అలాగే ఒక వారం రోజులు పరీక్షల ఆధారంగా 10% కంటే ఎక్కువ పాజిటివ్ రేటు లేదా ఆసుపత్రి బెడ్ల ఆక్యుపెన్సీ 40% కంటే ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కంటైన్మెంట్ చర్యలు చేపట్టాలని చెప్పారు. ఒమిక్రాన్ ముప్పును ఎదుర్కోవడానికి కంటైన్మెంట్, కరోనా పరీక్షలు, క్లినికల్ మేనేజ్మెంట్, కోవిడ్ సేఫ్ బిహేవియర్, వ్యాక్సినేషన్ 5 అంశల స్ట్రాటజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ