దేశంలో కొత్తగా 6,358 కరోనా పాజిటివ్ కేసులు, 293 మరణాలు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 28, మంగళవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 3,47,99,691 కు, మరణాల సంఖ్య 4,80,290 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 0.61 శాతంగా నమోదవగా, వరుసగా గత 85 రోజులుగా పాజీటివిటీ రేటు 2 శాతం కన్నా తక్కువగానే నమోదవుతుంది.
దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 6,450 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,42,43,945 కు చేరుకుంది. ఇక కరోనా రికవరీ రేటు 98.40 శాతం గానూ, మరణాల రేటు 1.38 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 75,456 (0.22) మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు దేశంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 653కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, అత్యధికంగా మహారాష్ట్రలో 167, ఢిల్లీలో 165, కేరళలో 57, తెలంగాణలో 55, గుజరాత్ లో 49, రాజస్థాన్ లో 46, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, మధ్యప్రదేశ్ లో 9, ఒడిశాలో 8, ఆంధ్రప్రదేశ్ లో 6, వెస్ట్ బెంగాల్ లో 6, హర్యానా, ఉత్తరాఖండ్ లో నాలుగు చొప్పున, చండీఘర్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో 2 చొప్పున, ఉత్తర్ ప్రదేశ్ లో 2, గోవా, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, మణిపూర్ లలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. కాగా మొత్తం 653 బాధితుల్లో ఇప్పటికే 186 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ