కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మే 31 వ తేదీవరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్ సెంటర్లు తెరవడానికి ఎలాంటి అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇకపై పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు తెరవడానికి అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని వార్తలు రావడంతో ఈ విషయంపై హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి అధికారికంగా వివరణ ఇస్తూ ప్రకటన చేశారు. “విద్యాసంస్థలు తెరవడంపై హోమ్ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దేశవ్యాప్తంగా ఇప్పటికీ అన్ని విద్యాసంస్థలు తెరవడంపై నిషేధం కొనసాగుతుందని” ట్వీట్ చేశారు.
#FactCheck
Claim: MHA permits all States to open schools.Fact: No such decision taken by MHA. All Educational institutions are still prohibited to open, throughout the country.#FakeNewsAlert#COVID19#IndiaFightsCoronavirus pic.twitter.com/mSWfIDWwNs
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) May 26, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu