దేశంలో ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఇప్పుడు ఐదు రాష్ట్రాలు కరోనా రహిత రాష్ట్రాలుగా మారాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (డిఓఎన్ఈఆర్) సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఏప్రిల్ 27, సోమవారం నాడు ప్రకటించారు. సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ మరియు త్రిపుర రాష్ట్రాలు ఇప్పుడు పూర్తిస్థాయి కరోనా రహిత రాష్ట్రాలుగా మారాయని చేప్పారు. అలాగే ఈ ప్రాంతంలోని మిగతా మూడు రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ మరియు మిజోరాంలలో ఇటీవల ఎలాంటి కొత్త కేసులు నమోదుకానప్పటికీ, అవి కరోనా రహిత రాష్ట్రాలు కావని పేర్కొన్నారు.
ఈశాన్య రాష్ట్రాలలో తక్కువ కేసులు నమోదైన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, ఆయన నాయకత్వంలో భారత ప్రభుత్వం గత ఆరేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో ప్రాధాన్యతనిచ్చిందని జితేంద్ర సింగ్ అన్నారు. ఈ అత్యవసర సమయంలో కూడా ఈ ప్రాంతానికి ఎయిర్ కార్గో ద్వారా సరకు రవాణా జరుగుతుందని, మార్చ్ 30వ తేదినుంచే ఎయిర్ ఇండియా మరియు భారత వైమానిక దళం ద్వారా ఈ ప్రాంతానికి నిత్యావసర వస్తువుల సరఫరా జరుగుతుందని చెప్పారు. దేశంలోని ఈశాన్య ప్రాంతంతో పాటుగా, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ద్వీప ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ ఆదేశించినట్టు మంత్రి తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]