కరోనా నివారణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రప్రభుత్వాలు నిర్వహించదలిచిన కరోనా ర్యాపిడ్ టెస్టులను నిలిపివేయాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ మరో కీలక ప్రకటన చేసింది. చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్స్లో నాణ్యత లోపించిందని గమనించిన తరవాత ఇక నుంచీ ఆ టెస్టింగ్ కిట్లను వాడరాదని రాష్ట్రాలను ఐసీఎంఆర్ ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన గ్వాంగ్జౌ వాండ్ఫో బయోటెక్ మరియు జుహై లివ్జోన్ డయాగ్నోస్టిక్స్ యొక్క ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ల ఫలితాలలో వైవిధ్యం ఉందని, సరైన ప్రమాణాల్లో ఫలితాలు రావడం లేదని పేర్కొన్నారు.
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, ఆ రెండు సంస్థల నుండి ఇప్పటికే సేకరించిన టెస్టింగ్ కిట్లను ఉపయోగించడం మానేసి, వాటిని తిరిగి సరఫరాదారులకు పంపించమని రాష్ట్రాలకు సూచించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. కరోనా నిర్ధారణకు కేవలం ఆర్టీ-పీసీఆర్ టెస్టులు మాత్రమే సరైన ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఇక అనేక రాష్ట్రాలు ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లను కొనుగోలు చేసినందున, వాటిని వైరస్ లక్షణాలపై నిఘా ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu