ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. వరుసగా ఏడో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10368 పాజిటివ్ కేసులు, 94 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 1, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,45,139 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 4053 కి పెరిగింది. మరో 9350 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 59,834 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన చిత్తూరులో పద్నాలుగు మంది, పశ్చిమగోదావరిలో పదకొండు మంది, తూర్పుగోదావరిలో పదిమంది, అనంతపూర్ లో ఏడుగురు, గుంటూరులో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, కడపలో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, కర్నూల్ లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, విజయనగరంలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4053 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 29, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 37,82,746
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 4,45,139
- కొత్తగా నమోదైనా కేసులు : 10368
- నమోదైన మరణాలు : 94
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 3,39,876
- యాక్టీవ్ కేసులు : 101210
- మొత్తం మరణాల సంఖ్య : 4053
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu