ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అద్భుతంగా పోరాడాడని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఓటమికి అఖిలేష్ యాదవ్ ఒక్కడే కారణం కాదని, అనేక అంశాలు పనిచేశాయని విశ్లేషించారు. అఖిలేష్ శక్తివంతమైన బీజేపీ ప్రభుత్వంపై ఒంటరి పోరాటం చేశాడని, తన శక్తి మేరకు పనిచేశాడని తెలిపారు. మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగటంతోపాటు నిస్తేజంగా ఉన్న పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాడని ప్రసంసించారు. అలాగే, ఎస్పీ గత ఎన్నికల కన్నా ఎక్కువ స్థానాల్లో గెలుపొందిందని గుర్తుచేశారు.
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని కోలోవటంపై పవార్ స్పందిస్తూ.. అది కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాథం అని వ్యాఖ్యానించారు. అలాగే, బీజేపీకి ధీటుగా పోరాడాడని శరద్ పవార్ అన్నారు. భవిష్యత్తులో యూపీలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఎస్పీ నే అని స్పష్టం చేశారు. కాగా, మొత్తం 403 స్ధానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ 268 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎస్పీ 130 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ 2 స్ధానాల్లో, ఇతరులు 2 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ