ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు భారత్లో కూడా విజృంభిస్తోంది. భారత్లో ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు విస్తరించింది. మొత్తం 109 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఎక్కువ కేసులు వెలుగు చూశాయి. శుక్రవారం అక్కడ మరో ఎనిమిది మందికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 48కి చేరింది. అయితే, గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్ ఎంతో స్పీడ్గా వ్యాపిస్తోంది. ఇప్పటికి 91 దేశాలలో ఈ వైరస్ వెలుగుచూసింది.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కరోనా నిబంధనలు పాటించాలని, వీలైంత వరకు ప్రయాణాలను వాయిదా వేయాలని సూచించింది. పండగలు, న్యూ ఇయర్ వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని కోరింది. దేశంలోని 19 జిల్లాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్ రేటు ఒక వారంలో ఐదు నుంచి 10 శాతంగా ఉంది. మిగతా దేశాలతో పోల్చితే కోవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ ముందుంది. బ్రిటన్తో పోలిస్తే 12.5 రెట్లు అధిక వ్యాక్సినేషన్ మనదేశంలో ఉందని, ఇప్పటివరకు 136 కోట్ల వ్యాక్సినేషన్ డోసులను దేశవ్యాప్తంగా పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ