మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్పై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ స్పందించారు. గురువారం ఆయన దీనిపై విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గవర్నర్ కోష్యారీ తనకున్న అన్ని పరిమితులను దాటేశారని అన్నారు. ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. బాధ్యతారాహిత్య ప్రకటనలు చేసే వ్యక్తులకు పెద్ద పదవులు ఇవ్వడం సరికాదని అన్నారు. ఛత్రపతి ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తించిన కోష్యారీపై సత్వరమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ నవంబర్ 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ను ఉద్దేశించి ‘ఆయన పాత తరానికి మాత్రమే స్ఫూర్తి’ అంటూ వివాదానికి తెర లేపారు.
మరోవైపు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు మరియు రాజసభ ఎంపీ ఉదయన్రాజే భోంస్లే కూడా మండిపడ్డారు. గవర్నర్ను తన పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేయడమే కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ‘గవర్నర్ మరియు బిజెపి అధికార ప్రతినిధి చేసిన ప్రకటనలు దేశం యొక్క విశ్వాసాలకు చాలా విరుద్ధంగా ఉన్నాయి, మీరు మహారాష్ట్ర గవర్నర్ను తొలగించే చర్యలు తీసుకుంటే అది సముచితం. ఈ ప్రస్తుత ప్రతిష్టంభనను పరిష్కరించడంలో మీ చర్యలు మరియు చర్చలు మహారాష్ట్ర మరియు దేశ ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో మైళ్ల దూరం వెళ్తాయి. దీనిపై మీరు తీసుకునే చర్యలు ప్రజల విశ్వాసం మరియు విశ్వాసానికి సంఘీభావంగా నిలుస్తాయి’ అని లేఖలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE