దసరా, దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ పేరుతో అమెజాన్, ది బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్కార్ట్ సంస్థలు కస్టమర్లకు భారీ ఆఫర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లకు కేంద్రప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సేల్స్ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచిన వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయి(కంట్రీ ఆఫ్ ఆర్జిన్), మరియు ఇతర సంబంధిత విషయాలు తెలిపే సమాచారం బహిర్గతం చేయకపోవడంపై కేంద్రం స్పందించింది. ఈ అంశంపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ రెండు ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై స్పందించేందుకు 15 రోజుల సమయం ఇచ్చారు. మరోవైపు అన్ని ఈ-కామర్స్ సంస్థలు నిబంధనలను పాటించేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu