మెక్సికోలోని లియోన్లో జరుగుతున్న ఐడబ్ల్యుఎఫ్ ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ వెయిట్ లిఫ్టర్ గురునాయుడు సనపతి స్వర్ణపతకం సాధించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరానికి చెందిన గురునాయుడు 55 కిలోల విభాగంలో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అలాగే యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశం తరపున స్వర్ణం గెలిచిన మొదటి వెయిట్ లిఫ్టర్గా గురునాయుడు నిలిచాడు. స్నాచ్ లో 104 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ లో 126 కిలోలుతో మొత్తంగా 230 కిలోలు ఎత్తడంతో గురునాయుడుకు స్వర్ణం సొంతమైంది.
ఈ విభాగంలో సౌదీ అరేబియా కింగ్డమ్ అలీ మజీద్ 229 కిలోలతో రెండో స్థానంలో నిలువగా, కజకిస్థాన్కు చెందిన యెరాసిల్ ఉమ్రోవ్ 224 కిలోలతో మూడో స్థానంలో నిలిచారు. ఇక రెండు రోజు పోటీల్లో భారత వెయిట్ లిఫ్టర్ సౌమ్య ఎస్ దాల్వీ 50 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. మరోవైపు మొదటిరోజున భారత్ లిఫ్టర్లు ఆకాంక్ష కిషోర్ వ్యావరే (40 కేజీలు) మరియు విజయ్ ప్రజాపతి (49 కేజీలు) రజత పతకాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY