దేశంలో రోజు రోజుకూ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఎంతోమంది ప్రముఖులు కూడా దాని బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్లో తప్పించుకున్న చాలా మందికి ఇప్పుడు వైరస్ సోకుతుంది. తాజాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు కరోనా సోకింది. కోవిడ్ టెస్టులో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిన విషయాన్ని పవారే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
అయితే తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శరద్ పవార్ చెప్పారు. డాక్టర్లు సూచించిన మేరకు.. ఐసోలేషన్లో ఉన్నానని, చికిత్స పొందుతున్నానని తెలిపారు. అదేవిధంగా.. గత కొన్నిరోజులుగా తనను కలిసినవారిలో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అందరూ తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రికాషన్స్ ముఖ్యం అని శరద్ పవార్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF