ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 40,266 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 14,502 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1728, అనంతపూర్ లో 1610, ప్రకాశంలో 1597, కర్నూల్ లో 1551, కడపలో 1492, నెల్లూరులో 1198 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,95,136 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా పశ్చిమగోదావరిలో ఇద్దరు, గుంటూరు, కర్నూల్, నెల్లూరు, శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14549 కు చేరింది. గత 24 గంటల్లో 4,800 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,87,282 చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 93,305 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,21,87,297 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF