ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గుడివాడ క్యాసినో ఘటన కుదిపేస్తోంది. మంత్రి కొడాలి నానికి సంబంధించిన K కన్వెన్షన్ సెంటర్ లో.. సంక్రాంతి పండగ సమయంలో క్యాసినో నడిచినట్లుగా ఆంధ్రలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అయితే, దీనిపై మంత్రి కొడాలి నాని కూడా అదేవిధంగా స్పందించారు. తాను క్యాసినో నడిపినట్లుగా నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగులబెట్టుకుంటానని తీవ్ర వ్యాఖ్యలతో ప్రతిపక్షానికి సవాల్ చేశారు. కానీ ఈ క్యాసినో వ్యవహారంపై ప్రతిపక్షాల విమర్శలు మాత్రం ఆగటంలేదు.
ఈ నేపథ్యంలో.. ఈ ఘటనపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచల వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో అసలు క్యాసినో నిర్వహణ జరగలేదని వల్లభనేని వంశీ అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందాలు, పేకాట శిబిరం మాత్రమే జరిగాయని వంశీ తెలిపారు. అయితే, కొడాలి నాని అనారోగ్యంతో ఉండటంతో.. అక్కడ తన స్నేహితులు శిబిరం నిర్వహించిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. శిబిరం నిర్వహించిన వారు నా స్నేహితులు.. వారు ఎవరో కూడా కొడాలి నానికి తెలియదని చెప్పారు.
అయితే, ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా.. అది క్యాసినో, క్యాబేరోనే కాదన్నారు. అవికూడా.. మంత్రి కొడాలి నాని కి సంబంధించిన K కన్వేన్షన్ సెంటర్లో కాదు.. దాని పక్కన లే అవుట్ ఉన్న స్థలంలో జరిగాయని, రాజకీయ లబ్ది కోసమే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పేరుతో నానా యాగీ చేస్తోందని విమర్శించారు. అమ్మాయిల డ్యాన్సుల్లో అర్ధ నగ్న దృశ్యాలు లేవన్నారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని, వంశీ చెప్పారు. టీడీపీ హయాంలో మేం పనిచేసాం, అప్పుడు నిర్వహించిన శిబిరాలే ఇప్పుడు జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF