కరోనా కట్టడిలో న్యూజిలాండ్ దేశం మొదటి నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో ఒక కరోనా కేసు వెలుగుచూసింది. న్యూజిలాండ్ లో చివరిగా ఫిబ్రవరి నెలలో కరోనా కేసు నమోదవగా, ఆరు నెలల అనంతరం కొత్తగా మరొకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో దేశవ్యాప్తంగా బుధవారం నుంచి మూడు రోజులపాటుగా లాక్డౌన్ విధిస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మంగళవారం నాడు ప్రకటించారు.
ఇక కరోనా కేసు వెలుగుచూసిన ఆక్లాండ్ లో, అతను సంచరించిన కోరమండెల్, కోస్టల్ పట్టణాల్లో ఏడు రోజులు పాటుగా లాక్డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు. కొత్తగా ధృవీకరించబడిన కేసు డెల్టా వేరియంట్ గా అధికారులు భావిస్తున్నారని, ఇతర కేసులు కూడా ఉండవచ్చని, ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కఠినమైన లాక్డౌన్ లో భాగంగా పాఠశాలలు, కార్యాలయాలు మరియు అన్ని వ్యాపార సంస్థలు మూసివేయబడతాయని, కేవలం అవసరమైన సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ